పోస్ట్‌లు

ఏప్రిల్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

మే 3న ఏఐటీయూసీ నగర 3వ మహాసభలను జయప్రదం చేయండి. ఏఐటీయూసీ నగర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం ,శనగరపు చంద్రశేఖర్ లు కార్మిక వర్గానికి పిలుపు.

చిత్రం
ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ మే 3న ఏఐటీయూసీ నగర 3వ మహాసభలను జయప్రదం చేయండి ఏఐటీయూసీ నగర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం , శనగరపు చంద్రశేఖర్ లు కార్మిక వర్గానికి పిలుపు అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ రామగుండము నగర సమావేశం జరిగింది. ఈ సమావేశం లో  మే 3 న ఏన్ టీ పి సి లో జరిగే నగర ఏఐటీయూసీ 3వ మహాసభ ను జయప్రదం చేయాలనీ ఏఐటీయూసీ నగర అధ్యక్షులు అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ లు కోరారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర సదానందం గారు,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వైవి రావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కే సునీల్ గారు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల రమేష్ గారు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోసిక మోహన్ గారు,సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కే కనకరాజు గారు, సిపిఐ 41 డివిజన్ కార్పొరేటర్ కామ్రేడ్ మార్కాపూరి సూర్య గారు హాజరవుతున్నారు.ఈ మహాసభలో మధ్యన భోజనం వర్కర్స్,ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్ కాంట్రాక్టు వర్కర్స్,ఎన్ టీ పి సి కాంట్రాక్టు వర్కర్స్, ఆశ వర్కర్స్, ఆర్ టీ సి వర్కర్స్, భ...

రాష్ట్ర స్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్‌లో కరీంనగర్ జిల్లా జట్టు ఛాంపియన్

చిత్రం
 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ రాష్ట్ర స్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్‌లో కరీంనగర్ జిల్లా జట్టు ఛాంపియన్ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ వేదికగా ఏప్రిల్ 27 నుండి 29 వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ బుధవారం ముగిసింది. డీఎఫ్ఏ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో కరీంనగర్ జిల్లా జట్టు అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో కరీంనగర్ జట్టు, రంగారెడ్డి జిల్లా హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ జట్టుతో తలపడి 1-0 గోల్ తేడాతో విజయం సాధించింది. హకీంపేట్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేత జట్టును రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ W. గణపతి, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నాయుడు, ఉపాధ్యక్షుడు W. వెంకటరావు అభినందించారు. జట్టును విజయానికి నడిపించిన హెడ్ కోచ్ W. విజయ్, అసిస్టెంట్ కోచ్ బొంతు రేవంత్ కృషిని కొనియాడారు. క్రీడాకారిణుల క్రమశిక్షణ, కఠిన శిక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రో...

వాహనదారుల సౌకర్యం కోసం దిశా సూచక బోర్డు ఏర్పాటు - కంపెల్లి రఘు

చిత్రం
 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ వాహనదారుల సౌకర్యం కోసం దిశా సూచక బోర్డు ఏర్పాటు – కంపెల్లి రఘు రామగుండం: 30-04-2026 గురువారం రోజున రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ (RMC) ఆధ్వర్యంలో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో RFCL ప్రాంతంలో దిశా సూచక బోర్డు ఏర్పాటు చేశారు..ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ దిశా నిర్దేశ బోర్డును కంపెల్లి రఘు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు భద్రతకు ఇలాంటి సూచక బోర్డులు ఎంతో అవసరమని, ప్రమాదాలు తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు..ఈ కార్యక్రమంలో KR టీమ్ సభ్యులు సందీప్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఇది మనహక్కు సమాచార పత్రిక ✍️

ముర్మూర్ గ్రామంలో IKP కొనుగోలు కేంద్రం ప్రారంభం – రైతులకు మెరుగైన సేవలు అందిస్తాం: మనాలి ఠాకూర్

చిత్రం
 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ ముర్మూర్ గ్రామంలో IKP కొనుగోలు కేంద్రం ప్రారంభం – రైతులకు మెరుగైన సేవలు అందిస్తాం: మనాలి ఠాకూర్ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, సతీమణి మనాలి ఠాకూర్ అంతర్గాం మండలంలోని ముర్మూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన IKP కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులకు కనీస మద్దతు ధర (MSP) కల్పించడం మరియు మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా ప్రభుత్వానికి వడ్లు విక్రయించే సౌకర్యాన్ని అందించడం ఈ కొనుగోలు కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులు తమ కష్టానికి తగిన ప్రతిఫలం పొందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు..అలాగే ఈ కేంద్రం ద్వారా రైతులకు సమయానికి చెల్లింపులు అందడం, రవాణా సౌకర్యాలు మెరుగుపడడం, ధాన్యం నిల్వ సమస్యలు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. రైతుల ఆదాయం పెరగడం మరియు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, రామగుండం అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ ...

నూతన దారి మైసమ్మ ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు నియోజకవర్గ ప్రజలను మైసమ్మ తల్లి చల్లగా చూడాలి

చిత్రం
 ఇది మనహక్కు రామగుండం మండలం రిపోర్టర్✍️ నూతన దారి మైసమ్మ ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు  నియోజకవర్గ ప్రజలను మైసమ్మ తల్లి చల్లగా చూడాలి రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఈరోజు అంతర్గం మండలం పరిధిలోని నూతన దారి మైసమ్మ ఆలయంలో నిర్వహించిన దారి మైసమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు..భక్తి శ్రద్ధల మధ్య జరిగిన ఈ మహోత్సవంలో స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రజల విశ్వాసాలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది..ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రాంత ప్రజలందరికీ దారి మైసమ్మ తల్లి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు... ఇది మనహక్కు సమాచార పత్రిక ✍️

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో అధిక శాతం మేర మహిళలకె కేటాయించాలి రాష్ట్ర మేర టైలర్స్ వృత్తి సంక్షేమ సంఘం

చిత్రం
 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో అధిక శాతం మేర మహిళలకె కేటాయించాలి. రాష్ట్ర మేర టైలర్ వృత్తి సంక్షేమ సంఘం. ఈరోజు రాష్ట్ర బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కలిసి తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ జీవో నంబర్ Lr.No. 85/C/సేవింగ్ మిషన్ మహిళ/ 2025-2026 తేదీ.17-02-2026 ప్రకారం కుట్టు మిషన్ లను మేర మహిళలకు ఎక్కువ శాతం కేటాయించాలని వినతి పత్రంను సంఘ వెంకట్రాజం అధ్యక్షతన రాష్ట్ర మేర టైలర్ సంక్షేమ సంఘం తరపున కీర్తి జయంత్, గూడూరు ప్రభాకర్, జర్నలిస్టు గూడూరు లవన్ కుమార్. రామగిరి సుధాకర్, మునిగాల శ్యాంప్రసాద్ నాయకులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కలిసి రాష్ట్రంలో టైలర్ వృత్తి ప్రధాన జీవనాధారంగా, కులవృత్తి ఆధారంగా జీవిస్తూ ఉన్న మా మేర మహిళలకే కుట్టుమిషన్ల కార్యక్రమంలో ఎక్కువ శాతం కేటాయించాలని రాష్ట్ర బీసీ మంత్రివర్యులను కోరడం జరిగింది. దీనికి రాష్ట్ర మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి తప్పకుండా మేర మహిళలకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ...

గిన్నిస్ రికార్డ్ సాధించిన కరాటే మాస్టర్ పసునూటి చందు

చిత్రం
 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ గిన్నిస్ రికార్డ్ సాధించిన కరాటే మాస్టర్ పసునూటి చందు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఫైవ్ ఇంక్లైన్ ప్రాంతానికి చెందిన డ్రాగన్ షోటోకాన్ కరాటే క్లబ్ వ్యవస్థాపకుడు పసునూటి చందు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఈనెల 26న హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కటా ప్రోగ్రాంలో పాల్గొని 20 నిమిషాల్లో 40 సార్లు కరాటే కటా ప్రదర్శన చేసి అరుదైన ఘనతను అందుకున్నారు. సుమారు 2000 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో చందు ప్రతిభను చాటుకుని గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు. చిన్నప్పటి నుంచి కరాటేపై ఆసక్తితో నిరంతర సాధన, క్రమశిక్షణ, గురువుల మార్గదర్శకతతో ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్కేఐ ఇండియా చీఫ్ రచ్చ శ్రీను బాబు, జిల్లా కరాటే మాస్టర్లు పసునూటి శంకర్, తగరపు శంకర్, కరాటే శ్రీనివాస్, ఒడ్డెపల్లి సురేష్, మంథని నాగరాజు తదితరులు అభినందనలు తెలిపారు. ఇది మనహక్కు సమాచార పత్రిక ✍️

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గోదావరిఖని 1 టౌన్ ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహణ

చిత్రం
 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గోదావరిఖని 1 టౌన్ ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహణ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారి ఆదేశాల మేరకు, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఇంద్రసేనా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్‌.ఐ.అనూష గారు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగమైన 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర విద్యార్థుల కోసం ‘చైల్డ్ సేఫ్టీ – డ్రగ్స్‌కు నో చెప్పండి’ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాలు మరియు భవిష్యత్ జీవనశైలిపై వాటి ప్రభావం గురించి ఎస్‌.ఐ.అనూష గారు వివరంగా తెలియజేశారు.ప్రత్యేకంగా యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాదకద్రవ్యాలు శారీరక,మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదకరమైనవని, విద్యా జీవితం మరియు భవిష్యత్ లక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.విద్యార్థులు చెడ...

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి – బీజేపీ డిమాండ్

చిత్రం
 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️  రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి – బీజేపీ డిమాండ్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజురోజుకీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ సేఫ్టీ అథారిటీ మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు..ఇటీవల ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఇందిరానగర్, గౌతమి నగర్ ప్రాంతాలను బీజేపీ శ్రేణులు సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఇంజనీరింగ్ ప్రమాణాలు పాటించకుండా, సరైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయకుండా టౌన్ ప్లానింగ్ మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 ఫీట్ల రహదారిగా ఉన్న గౌతమి నగర్ రోడ్డును బీజేపీ నాయకులు స్వయంగా కొలిచి, అక్కడి నుంచే టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు..అనంతరం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాజీపేట శివాజీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించ...

స్వచ్ఛ రామగుండం లక్ష్యానికి మెప్మా ఆర్‌పీలు కీలకం – మేయర్ మహంకాళి స్వామి

చిత్రం
  ఇది మనహక్కు రామగుండం మండల్ రిపోర్టర్ ✍️ స్వచ్ఛ రామగుండం లక్ష్యానికి మెప్మా ఆర్‌పీలు కీలకం – మేయర్ మహంకాళి స్వామి స్వచ్ఛ రామగుండంగా నగరాన్ని తీర్చిదిద్దడంలో మెప్మా ఆర్‌పీలు కీలక పాత్ర పోషించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో మెప్మా ఆర్‌పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చెత్త బయట పడవేసే వారి ఫోటోలు తీసి మున్సిపల్ అధికారులకు పంపించాలని తెలిపారు. పలుమార్లు చెప్పినా వినకుండా చెత్త వేస్తే తప్పనిసరిగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. స్వచ్ఛ రామగుండం లక్ష్య సాధనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, నగర అభివృద్ధికి సంబంధించి సలహాలు, సూచనలు స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఎస్‌ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు... ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

మేయర్ మహంకాళి స్వామిని కలిసిన ఫ్రెండ్స్ ఫౌండేషన్ – పీవీ నరసింహారావు గారి పుస్తకం బహుకరణ

చిత్రం
 ఇది మనహక్కు రామగుండం మండలo రిపోర్టర్✍️ మేయర్ మహంకాళి స్వామిని కలిసిన ఫ్రెండ్స్ ఫౌండేషన్ – పీవీ నరసింహారావు గారి పుస్తకం బహూకరణ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామిని ఈరోజు ఫ్రెండ్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు రౌతు గణేష్ కలిసి పీవీ నరసింహారావు గారికి సంబంధించిన పుస్తకాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ ఫ్రెండ్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. సమాజ సేవలో వారి పాత్ర ప్రశంసనీయమని, భవిష్యత్తులో కూడా తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మీస వికాస్, మార్క ఆశ్రిత్ గౌడ్, కోలేటి విశాల్, రిషిక్ తదితరులు పాల్గొన్నారు. ఇది మనహక్కు సమాచార పత్రిక  ✍️

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండలం రిపోర్టర్✍️ 48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు  ఉదయం 6 గంటలకు రామగుండం మేయర్ శ్రీ మహంకాళి స్వామి గారు 99 రోజుల ప్రజా పాలన–పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా 48వ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పర్యటనలో భాగంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన మేయర్ గారు రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి, తిరుపతి, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను మేయర్ గారికి వివరించారు.. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

నిరుపేద యువతికి వివాహానికి ఆర్థిక సహాయం – బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి

చిత్రం
నిరుపేద యువతికి వివాహానికి ఆర్థిక సహాయం  బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి.. గోదావరిఖని : రామగుండం నియోజకవర్గం 9వ డివిజన్ వినోబా నగర్‌కు చెందిన నిరుపేద యువతి రాసూరి సాహితి తల్లిదండ్రులు లేక ఒంటరిగా జీవిస్తున్న నేపథ్యంలో, ఈ నెల 26న జరగనున్న ఆమె వివాహానికి ఆర్థిక సహాయం అందించారు BRS పార్టీ రాష్ట్ర నాయకులు, VHR ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల్ల హరీష్ రెడ్డి. ఈ విషయం కడమండ శ్రీహరి ద్వారా ఆయన దృష్టికి వెళ్లగా, వెంటనే స్పందించి పెళ్లి ఖర్చులకు సహాయం అందించారు..ఈ కార్యక్రమంలో కడమండ శ్రీహరి, పోయిల రవికుమార్, బొబ్బిలి సతీష్, రోడ్డ సంపత్, పల్లె మహేందర్, కందుగుల రాజు, మాల సంఘం నాయకులు నంది నరేష్, పిట్టల వెంకటి, నూకల మొండి, నంది నాగేశ్వరరావు, బస్తీ పెద్ద బెద శంకర్ తదితరులు పాల్గొన్నారు...ఆర్థిక సహాయం అందించిన హరీష్ రెడ్డికి రాసూరి సాహితి కృతజ్ఞతలు తెలిపారు. {ఇది మన హక్కు సమాచార పత్రిక..  మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్..  వడ్లకొండ మహేందర్ గౌడ్ }

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

చిత్రం
{✍️ఇది మన హక్కు సమాచార పత్రిక: గోదావరిఖని} పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్.. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ఆలస్యం జరుగుతుందనే నిరసనగా ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ నర్సంపేట బస్టాండ్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు..తీవ్ర గాయాలపాలైన ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఇది మన హక్కు సమాచార పత్రిక  మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్  వడ్లకొండ మహేందర్ గౌడ్ ..

కార్పొరేటర్ కందుల సతీష్ స్వరూప ఆధ్వర్యంలో పీటీఎం సమావేశం – పాఠశాల అభివృద్ధికి ప్రణాళికలు

చిత్రం
{ఇది మన హక్కు సమాచార పత్రిక : గోదావరిఖని} కార్పొరేటర్ కందుల సతీష్ స్వరూప ఆధ్వర్యంలో పీటీఎం సమావేశం – పాఠశాల అభివృద్ధికి ప్రణాళికలు.. రామగుండం ; 21వ డివిజన్‌లోని ఎంపీ యుపిఎస్ లక్ష్మీపూర్ పాఠశాలలో అకాడమిక్ ఇయర్ 2025-26 చివరి పని దినం సందర్భంగా ఈరోజు పీటీఎం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కందుల సతీష్ స్వరూప హాజరై విద్యార్థులకు విలువైన సూచనలు, సలహాలు అందించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంఖ్య పెంపు, రాబోయే విద్యా సంవత్సరానికి ప్రణాళికలపై చర్చించారు.. అదనంగా పాఠశాలలో ప్రారంభం కానున్న డిజిటల్ తరగతుల గురించి తల్లిదండ్రులకు వివరించారు. రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేరికలు పెంచేందుకు జూన్ మొదటి వారంలో ‘బడి బాట’ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు... ఈ కార్యక్రమంలో లక్ష్మీపూర్ వాసులు పెద్దలు మాధవరావు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.. ఇది మన హక్కు సమాచార పత్రిక  మేనేజింగ్ డైరెక్టర్ &ఎడిటర్  వడ్లక...

కొత్త బొగ్గు అమ్మకం విధానంలో ప్రభుత్వ సంస్థలు సత్తా చాటాలి: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

చిత్రం
ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని 📍 సింగరేణి భవన్, హైదరాబాద్: దేశంలో బొగ్గు రంగాన్ని మరింత పోటీదారులుగా మార్చేందుకు ప్రవేశపెడుతున్న కొత్త అమ్మకపు విధానంలో ప్రభుత్వ సంస్థలు కూడా తమ ప్రతిభను చాటాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సూచించారు..మగళవారం నాడు న్యూఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా బొగ్గు గనుల సంస్థల పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తూ, నేషనల్ కోల్ ఎక్స్చేంజ్ ద్వారా బొగ్గు విక్రయాల విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తక్కువ ధరకు బొగ్గు విక్రయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వినియోగదారులు తమకు నచ్చిన గ్రేడ్ బొగ్గును ఎంచుకునే అవకాశాన్ని ఈ విధానం కల్పిస్తుందని పేర్కొన్నారు..ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పనితీరును సమీక్షిస్తూ, ప్రస్తుత పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే నాణ్యమైన బొగ్గును తక్కువ ధరకు అందించడం కీలకమని సూచించారు. అలాగే ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి మార్కెట్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సంస్థ సీఎండీ డాక్టర్ బ...