48వ డివిజన్లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
ఇది మన హక్కు రామగుండం మండలం రిపోర్టర్✍️
48వ డివిజన్లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
ఉదయం 6 గంటలకు రామగుండం మేయర్ శ్రీ మహంకాళి స్వామి గారు 99 రోజుల ప్రజా పాలన–పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా 48వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
పర్యటనలో భాగంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన మేయర్ గారు రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు.
ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి, తిరుపతి, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను మేయర్ గారికి వివరించారు..
కామెంట్లు