పోస్ట్‌లు

జనవరి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

""బాబా తాజుద్దీన్ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం..

చిత్రం
(ఇది మన హక్కు సమాచార పత్రిక) గోదావరిఖని ""బాబా తాజుద్దీన్ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం.. గోదావరిఖని చౌరస్తాలో బాబా తాజుద్దీన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా తాజుల్ ఔలియా ఎస్‌బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పరస్పర సౌహార్దం, మానవతా భావాన్ని ప్రతిబింబించారు. బాబా తాజుద్దీన్ గారి సందేశమైన ప్రేమ, సేవ, సమానత్వం ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లింది.ట్రస్ట్  నిర్వాహకులు అడ్వకేట్ శానవాజ్ ఖాన్ ఆఫ్జాల్ రాజ్వి మాట్లాడుతూ, బాబా తాజద్దీన్ జ్ఞాపకర్థం సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం శాంతియుతంగా, సక్రమంగా ముగిసింది.ఈ కార్యక్రమం లో ట్రస్ట్ సభ్యులు మునవార్,అసిఫ్, అలీం, సయెద్ అహ్మద్, హాజీ, రియాజ్ బైగా, లియకత్, షాబుద్దీన్, సందేశ్, భీమ్ సంగపల్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.. ఇది మన హక్కు సమాచార పత్రిక  మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్  వడ్లకొండ మహేందర్ గౌడ్ ...

వినియోగదారుల సేవల్లో ఉత్తమ ప్రతిభ : గోదావరిఖని ఏడీఈ వెంకటేశ్వర్లుకు టీఎస్ ఎన్‌పీడీసీఎల్ సీ & ఎండీ ప్రశంసా పత్రం.. *

చిత్రం
( ఇది మన హక్కు సమాచార పత్రిక )గోదావరిఖని వినియోగదారుల సేవల్లో ఉత్తమ ప్రతిభ : గోదావరిఖని ఏడీఈ వెంకటేశ్వర్లుకు టీఎస్ ఎన్‌పీడీసీఎల్ సీ & ఎండీ ప్రశంసా పత్రం.. * *హన్మకొండ :** హన్మకొండ నక్కలగుట్టలోని తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSNPDCL) కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలలో విశేష ప్రగతి సాధించి, వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించినందుకుగాను గోదావరిఖని ఏడీఈ **వెంకటేశ్వర్లుకు** సంస్థ సీ & ఎండీ **కర్నాటి వరుణ్ రెడ్డి** ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థలో సమర్థవంతమైన నిర్వహణ, వినియోగదారుల సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర, ప్రజలతో మమేకమై సేవలందించడం వంటి అంశాల్లో ఏడీఈ వెంకటేశ్వర్లు చూపిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించడం గర్వకారణమని అధికారులు పేర్కొన్నారు. కాగా **‘వెంకన్న’**గా సుపరిచితులైన ఏడీఈ వెంకటేశ్వర్లు ప్రశంసా పత్రం అందుకోవడంపై సంస్థ ఉద్యోగులు, సహచరులు, ఆయన శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చే...

రామగుండం కార్పొరేషన్ ఎన్నికల అభ్యర్థుల అప్లికేషన్ల స్వీకరణ మరియు జన కళ్యాణ్ దివాస్ కార్యక్రమం..

చిత్రం
(ఇది మన హక్కు సమాచార పత్రిక).. గోదావరిఖని రామగుండం కార్పొరేషన్ ఎన్నికల అభ్యర్థుల అప్లికేషన్ల స్వీకరణ మరియు జన కళ్యాణ్ దివాస్ కార్యక్రమం..  జనవరి 25 ఆదివారం రోజు సాయంత్రం 7:00 గంటలకి రామగుండం నియోజకవర్గం లోని గోదావరిఖని స్థానిక చౌరస్తా వద్ద ఉన్న స్ఫూర్తి భవనంలో  బహుజన్ సమాజ్ పార్టీ రామగుండం కార్పొరేషన్ *ఎన్నికల అభ్యర్థుల అప్లికేషన్* మరియు పెద్దపల్లి మున్సిపాలిటీ, సుల్తానాబాద్ మున్సిపాలిటీ, మంథని మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థుల అప్లికేషన్ ఫారం ఇవ్వడం జరిగింది, మరియు *జన కళ్యాణ్ దివాస్* కార్యక్రమం విషయం పైన కార్యకర్తల సమావేశంలో చర్చించడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *బహుజన్ సమాజ్ పార్టీ సెంట్రల్ స్టేట్ కో-ఆర్డినేటర్ దాగిళ్ల దయానంద రావు ,* మరియు విశిష్టాధితులు:- తెలంగాణ స్టేట్ కార్యవర్గ సభ్యులు *మాతంగి అశోక్ ,* కరీంనగర్ జోనల్ ఇన్చార్జులు దొడ్డే సమ్మయ్య , వర్కిల్లా మల్లేష్ , పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి పేగ నరేష్, మరియు పెద్దపెల్లి జిల్లా కార్యవర్గం నుండి జిల్లా అధ్యక్షులు ఇరికిల్లా రాజనర్సయ్య గారు, ఉపాధ్యక్షులు నార్ల గోపాల్ యాదవ్, జనరల్ సెక్రెటరీ కంపెల...

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో న్యాయవాదులు–జ్యుడిషియల్ సిబ్బంది మధ్య ఉత్కంఠభరిత క్రికెట్ మ్యాచ్..

చిత్రం
( ఇది మనహక్కు సమాచార పత్రిక):గోదావరిఖని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో న్యాయవాదులు–జ్యుడిషియల్ సిబ్బంది మధ్య ఉత్కంఠభరిత క్రికెట్ మ్యాచ్.. జనవరి 26 .2026   గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు స్థానిక శాతవాహన యూనివర్సిటీ  పీజీ కాలేజ్  గ్రౌండ్ లో గోదావరిఖని  న్యాయవాదులకు మరియు గోదావరిఖని జ్యుడిషియల్ ఎంప్లాయిస్ స్టాఫ్ మధ్య జరిగిన హోరాహోరీ క్రికెట్ మ్యాచ్..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న  అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ డాక్టర్ శ్రీ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ  ఆరోగ్యమే మహాభాగ్యం అని క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే  ప్రజలకు సరియైన న్యాయాన్ని అందించే వీలు ఉంటుంది అని తెలియజేశారు..టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోర్టు సిబ్బంది జట్టు మొదట బ్యాటింగ్ చేపట్టిన న్యాయవాద జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 67 పరుగులు చేయగా బ్యాటింగ్ చేపట్టిన కోర్టు స్టాఫ్ జట్టు ఆరు ఓవర్లు ముగిసేలోపు విజయాన్ని సాధించింది ఈ మ్యాచ్ లో న్...

గుడిపల్లి బోడగుట్టపై చెన్నకేశవస్వామి బ్రహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు..

చిత్రం
((ఇది మన హక్కు సమాచార పత్రిక)).. గుడిపల్లి బోడగుట్టపై చెన్నకేశవస్వామి బ్రహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు.. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్  మరియు వారి సతీమణి  మనాలి ఠాకూర్  పాలకుర్తి మండల పరిధిలోని గుడిపల్లి బోడగుట్టపై భూ-గర్భదేవి సమేత చెన్నకేశవస్వామి బ్రహోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.గురువారం వైభవంగా ప్రారంభమైన బ్రహోత్సవాల్లో భాగంగా భూ-గర్భదేవి సమేత చెన్నకేశవస్వామి, అభయాంజనేయస్వామికి నవకలశ స్నపనం, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, తీర్థ–ప్రసాదాలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దంపతులు కాసర శ్రీనిధి – కరణాకర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, భక్తబృందం, గుడిపల్లి మరియు జయారాం గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.--- ఇది మన హక్కు సమాచార పత్రిక  మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్  వడ్లకొండ మహేందర్ గౌడ్

గుండె పోటుతో మరణించిన ప్రముఖ జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష.....

చిత్రం
(ఇది మన హక్కు సమాచార పత్రిక):పెద్దపల్లి జిల్లా  గుండె పోటుతో మరణించిన ప్రముఖ జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష..... ఈరోజు కాల్వశ్రీరాంపూర్ మండలం ఉషాన్నపల్లి గ్రామంలో  గుండెపోటు తో బాలే శివ ప్రసాద్ మరణించారు..అని తెలిసి పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ శ్రీమతి దాసరి ఉష గారు వారి కుటుంబ సభ్యులను కలిసి వారికీ తమ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.  మండలానికి వారు రిపోర్టర్ గా చేసిన సేవలు మరువలేమాని, బాలే శివ ప్రసాద్ గారు వారి భార్య పిల్లలకి తీరని కన్నీటి శోకం మిగిల్చి వెళ్ళిపోయారు. అని అన్నారు. వారు ఒక జర్నలిస్ట్ గా చేస్తూనే మాలాంటి నాయకులకు సలహాలు సూచనలు ఇచ్చేవారని గుర్తు చేసారు.. వారి కుమారులు అజయ్, అర్షిత్ తో కలిసి బాలే శివ ప్రసాద్ గారి  చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు  అర్పించిన పెద్దపల్లి జిల్లా    బీసీ జేఏసీ  చైర్మన్ దాసరి ఉష..ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ కొండి సతీష్,  పెద్దపల్లి జిల్లా ఇంటలెక్చువల్ ఫోరం  కన్వీనర్ అలువాల రాజేందర్, సాగర్, అరుణ, లక్ష్మీ , ...

తెలంగాణ ప్రభుత్వ పెద్దపల్లి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్‌గా నియమితులైన కవ్వంపల్లి సతీష్‌ను రామగుండం శాసన సభ్యులు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఘనంగా సన్మానించారు...

చిత్రం
((ఇది మనహక్కు సమాచార పత్రిక..గోదావరిఖని)) ""..ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్‌గా నియమితులైన కవ్వంపల్లి సతీష్‌ను రామగుండం శాసన సభ్యులు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఘనంగా సన్మానించారు...  గోదావరిఖనిలోని రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కవ్వంపల్లి సతీష్‌ ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సతీష్‌కు ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ కవ్వంపల్లి సతీష్ గత 25 సంవత్సరాలుగా దళితుల అభ్యున్నతికి కషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతూ, దళిత సంఘాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారని, ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్‌గా నియమితులు కావడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం కషి చేయాలని, ఎస్సీ, ఎస్టీల సమస్యలు ఏమైనా పరిష్కారానికి ముందుండి కషి చేయాలని, సమస్యలు ఏమున్న తమ, కలెక్టర్ దష్టికి తీసుకు రావాలని తెలిపా...

ఇది మన హక్కు సమాచార పత్రిక క్యాలెండర్–డైరీని ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ..

చిత్రం
((ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని)) ఇది మన హక్కు సమాచార పత్రిక క్యాలెండర్–డైరీని ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్, రామగుండం కార్పొరేషన్ (స్థానిక సంస్థల) కమిషనర్ జె. అరుణ శ్రీ  “ఇది మన హక్కు” సమాచార పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ మరియు డైరీని ఘనంగా ఆవిష్కరించారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు హక్కులపై అవగాహన కల్పించడంలో సమాచార పత్రికల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే దిశగా “ఇది మన హక్కు” పత్రిక చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఇది మన హక్కు సమాచార పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్ వడ్లకొండ మహేందర్ గౌడ్ 60వ, డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మేకల అబ్బాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు... ఇది మన హక్కు సమాచార పత్రిక  మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్  వడ్లకొండ మహేందర్ గౌడ్

"".స్కావెంజర్స్, రీహైబిటేషన్ విజిలెన్స్ జిల్లా కమిటీ సభ్యుడిగా **కొండ కుమార్ కు ప్రభుత్వ నియామక పత్రం..

చిత్రం
(ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని).. "".స్కావెంజర్స్, రీహైబిటేషన్ విజిలెన్స్ జిల్లా కమిటీ సభ్యుడిగా **కొండ కుమార్ కు ప్రభుత్వ నియామక పత్రిక...  స్కావెంజర్స్, రీహైబిటేషన్ విజిలెన్స్ జిల్లా కమిటీ సభ్యుడిగా **కొండ కుమార్** ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం రోజున సంబంధిత అధికారుల నుంచి నియామక ఉత్తర్వులను **కొండ కుమార్** స్వీకరించారు. సమాజ సేవ పట్ల నిబద్ధత, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతర కృషి చేసిన వ్యక్తిగా **కొండ కుమార్** కు ఈ బాధ్యత దక్కడం హర్షణీయమని పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, స్కావెంజర్స్ పునరావాసం, సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తానని **కొండ కుమార్** ఈ సందర్భంగా తెలిపారు. ఈ నియామకంతో ఆయనకు శ్రేయోభిలాషులు, మిత్రులు, సామాజిక కార్యకర్తల నుంచి శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది.... ఇది మన హక్కు సమాచార పత్రిక  మేనేజింగ్ డైరెక్టర్ &ఎడిటర్ "  వడ్లకొండ మహేందర్ గౌడ్ ..

మద్యం సేవించి వాహనం నడపడం ఒక వ్యక్తినే కాదు, ఒక కుటుంబం మొత్తపు జీవితాన్ని నాశనం చేస్తుంది” : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బ్లాక్ స్పాట్ల సందర్శన – రోడ్ సేఫ్టీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమాలు

చిత్రం
(( రామగుండం పోలీస్ కమిషనరేట్))...                              మద్యం సేవించి వాహనం నడపడం ఒక వ్యక్తినే కాదు, ఒక కుటుంబం మొత్తపు జీవితాన్ని నాశనం చేస్తుంది” : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా"""..బ్లాక్ స్పాట్ల సందర్శన – రోడ్ సేఫ్టీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమాలు మద్యం సేవించి వాహనం నడపడం ఒక వ్యక్తినే కాదు, ఒక కుటుంబం మొత్తపు జీవితాన్ని నాశనం చేస్తుంది” అని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే ప్రధాన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజున బ్లాక్ స్పాట్ల సందర్శన, రోడ్డు భద్రత మరియు డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్, పెద్దపల్లి జోన్ పరిధిలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి మేడిపల్లి సెంటర్ వద్ద ఉన్న బ్లాక్ స్పాట్‌ను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గారు, పెద్దపల్లి డీసీపీ బి. రామ్...

..రామగుండంలో ఇది మన హక్కు పత్రిక క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ..."ప్రజా హక్కులపై అవగాహనకు పత్రికలే బలము: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్..

చిత్రం
రామగుండంలో ఇది మన హక్కు పత్రిక క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ..."ప్రజా హక్కులపై అవగాహనకు పత్రికలే బలము: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్.. ((ఇది మన హక్కు సమాచార పత్రిక));- పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేమక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేత ఇది మన హక్కు సమాచార పత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ మరియు డైరీని  ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రామగుండం నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా ప్రజా హక్కులు, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడంలో ఇది మన హక్కు వంటి పత్రికలు ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల గొంతుకగా పత్రిక నిరంతరం పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఇది మన హక్కు పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్ వడ్లకొండ మహేందర్ గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకులు దుర్గాప్రసాద్,  పెద్దపల్లి ఓబీసీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, శ్రీ చైతన్య గ్లోబల్ ఎడ్జ్ హైస్కూల్ ...

భక్తులకు ఇబ్బందులు లేకుండా జాతర ఏర్పాట్లు: స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్....

చిత్రం
((ఇది మన హక్కు సమాచార పత్రిక:-- గోదావరిఖని...)) ""భక్తులకు ఇబ్బందులు లేకుండా జాతర ఏర్పాట్లు: స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.... గోదావరిఖని: సమ్మక్క సారాలమ్మ జాతర ఏర్పాట్ల పనులను శుక్రవారం అర్జీ 1 జియం లలిత్ కుమార్ తో కలసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్  స్వయంగా పర్యవేక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అనంతరం సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్  కైట్ ఎగిరేసి పండుగ సందడి లో పాల్గొన్నారు..నాయకులతో, కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు... ఇది మన హక్కు సమాచార పత్రిక  మేనేజింగ్ డైరెక్టర్ &ఎడిటర్.. ((  వడ్లకొండ మహేందర్ గౌడ్ ))

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

చిత్రం
((ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని..)) రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా ""రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్.... జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అడ్ హాక్ కమిటీ సభ్యులు రావుల మధు ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి RK సాగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బరిలో ఉండబోయే అభ్యర్థుల జాబితా ప్రస్తుత వార్డుల వారీగా రాజకీయ సమీకరణలు ప్రాంత సమస్యలు తెలుసుకొని జనసేన గెలుపు కోసం కావలిసిన సూచనలు తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో  గెలుపే లక్ష్యం గా ముందుకు వెళ్లాలి అని దానికి నియోజకవర్గం లోని జనసేన నాయకులు జనసైనికులు కృషి  చేందుకు నియోజకవర్గం లో సమావేశం ఏర్పాటు చేయాలి అని తెలిపారు. వార్డ్ రిజర్వేషన్ ఖరారు అవ్వగానే కార్యాచరణ సిద్ధం చేద్దాం అని తెలిపారు.. ఇది మన హక్కు సమాచార పత్రిక  .. మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్  వడ్లకొండ మహేందర్ గౌడ్

గోదావరిఖని లో ఆకట్టుకుంటున్న వింటర్ ఉత్సవ్ మేళా-2026..”"" జన జాతరను తలపిస్తున్న ఎగ్జిబిషన్..!!,,,((ఊరు వాడ అందరి చూపు జల కన్యల వైపే...))

చిత్రం
 ((ఇది మన హక్కు సమాచార పత్రిక.. గోదావరిఖని)) గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వింటర్ ఉత్సవ్ మేళా-2026 ఎగ్జిబిషన్" సంక్రాంతి సంబరాలకు వేదికగా నిలిచింది .రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు మానసిక ప్రశాంతత కొరకు, మనోఉల్లాసం కోసం సకుటుంబ సమేతంగా ఎగ్జిబిషన్లో సందడి చేస్తున్నారు. ఈ సారి ఏర్పాటు చేసిన ప్రదర్శన పిల్లలకు పెద్దలకు, యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది. నిర్వాహకులు ఎండి అస్లాం  మాట్లాడుతూ,  ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు రామగుండం పారిశ్రామిక ప్రాంతములో మొట్టమొదటి సారిగా సందర్శకులు, యువత మనసు దోచుకునే విధంగా కాశ్మీర్ అందాలు, జల కన్యల విన్యాసాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసామని ప్రజలు యువత అద్భుతమైన మధురానుభూతి పొందుతున్నారని, పిల్లలకు మరింత ఎక్సైట్మెంట్, పెద్దలను ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులు సరదానుబూతి పొందుతున్నారని తెలిపారు. మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి గృహోపకరణవస్తువులు, కళంకారి బెడ్ షీట్స్, హ్యాండి క్రాఫ్ట్, జ్యూవలరి ఐటమ్స్, హ్యాండ్ బాగ్స్ మొదలైన ఏన్నోరకాల వేరైటీలు ఇంకా కోలంబస్, జాయింట్ వీల్, క్రాస్ వీల్, బ...

సోమనాథ్ ఆలయం పునర్నిర్మించ్చి 1000, సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గోదావరిఖనిలో శివాలయ పూజలు..

చిత్రం
((ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని..)) సోమనాథ్ ఆలయం పునర్నిర్మించ్చి  1000, సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గోదావరిఖనిలో శివాలయ పూజలు.. గోదావరిఖని:- సోమనాధ్ దేవాలయం పునర్నిర్మించ్చి 1000 సంత్సరాలు అవుతున్న సందర్బంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ,సోమనాధ్ దేవాలయం సందర్శించిన అనంతరం కార్యకర్తలు శివాలయాల సందర్శించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఉదయం గోదావరిఖని లోని మార్కండేయ శివాలయాన్ని  బిజెపి లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఉరుగొండ అపర్ణ ఆధ్వర్యంలో లోక కళ్యాణర్థం శివాలయంలో అభిషేకం అర్చన పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర నాయకులు క్యాతం వెంకటరమణ మాట్లాడుతూ 1026 సంత్సరంలో సోమనాధ్ జ్యోతిర్లంగ దేవాలయాన్ని పునర్నిర్మించారాని దేశం మీద దండ యాత్ర చేసిన ముష్కర ముస్లిం రాజులు వేలాది దేవాలయాలను చేయటం, నెలమట్టం చేయటం కాకుండా కొన్నింటి మీద గుమ్ముటాలను నిర్మించి మసీదులుగా మార్చారని ఈ దుర్మార్గమైన చెర్యలను అడ్డుకున్న వేలాది మంది హిందువులను ఉచకొత కోశారని అలాంటి దేవాలయాలలో సోమనాధ్ దేవాలయం ఒకటని అల్లవుద్దీన్ కిల్జి, మహమ్మాద్ గోరీ, ఔరఁగజేబ్ లాంట...

రామగుండం కార్పొరేషన్ 21 డివిజన్‌లో సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్‌ విజయం సాధించిన విజేతలకు క్యాష్ ప్రైజ్ అందించిన కార్పొరేటర్ అభ్యర్థి వేల్పుల అనిల్ యాదవ్..

చిత్రం
""ఇది మన హక్కు సమాచారం పత్రిక ""రామగుండం RFCL...)) రామగుండం కార్పొరేషన్ 21 డివిజన్‌లో సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్‌ విజయం సాధించిన విజేతలకు క్యాష్ ప్రైజ్ అందించిన కార్పొరేటర్ అభ్యర్థి వేల్పుల అనిల్ యాదవ్.. సంక్రాంతి పండుగ సందర్భంగా 21 డివిజన్‌లో కార్పొరేటర్, అభ్యర్థి వేల్పుల అనిల్ యాదవ్ , ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో డివిజన్‌కు చెందిన పలువురు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో రాము టీమ్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా విజేత జట్టుకు కార్పొరేటర్ అభ్యర్థి వేల్పుల అనిల్ యాదవ్,క్యాష్ ప్రైజ్ అందజేశారు. ఈ కార్యక్రమం యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేలా నిర్వహించడంపై పాల్గొన్న క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు.-.. ఇది మన హక్కు సమాచార పత్రిక  మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్  వడ్లకొండ మహేందర్ గౌడ్ ..

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

చిత్రం
📍 గోదావరిఖని.. (ఇది మనహక్కు సమాచార పత్రిక..) గోదావరిఖని వన్‌టౌన్‌ పరిధిలో పేకాట స్థావరం పై దాడి.. ఏడుగురి అరెస్ట్.. గోదావరిఖని, మారుతి నగర్, పరిధిలో ఒక వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించారు..వన్ టౌన్ ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి రూ.17,320 నగదు, 6 సెల్‌ఫోన్లు, రెండు సెట్ల పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు... ఇది మన హక్కు సమాచార పత్రిక  మేనేజింగ్ డైరెక్టర్ &ఎడిటర్  (వడ్లకొండ మహేందర్ గౌడ్)

"'..విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట- విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీరింగ్ శంకర్..

చిత్రం
  పెద్దపల్లి జిల్లా అంతర్గాం... "'..విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట- విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీరింగ్ శంకర్.. ""..పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టి టి ఎస్ అంతర్గంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంతర్గాం విద్యుత్ శాఖ అసిస్టెంట్ అధికారి శంకర్ మాట్లాడుతూ ఆదేశాల మేరకు ప్రతి ఊరిలో ని గ్రామ ప్రజలకు విద్యుత్ సమస్యల మీద, విద్యుత్ ద్వారా హాని కలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం వివరిస్తూ మీ గ్రామంలో ఇప్పుడు మాకు వివరించినటువంటి మీ సమస్యలు, మిగతాఎలాంటి సమస్యలు ఉన్న మేము తక్షణమే  మీ సమస్యను పరిష్కారం చేస్తామని ప్రజలకు తెలుపటం జరిగిందని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అధికారి శంకర్ తెలిపారు. అనంతరం విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఆశ శంకర్ ను గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ ఉషా, పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి అంకం రవి, సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంగోత్ రవి కుమార్ నాయక్, విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీరింగ్ శంకర్, సబ్ ఇంజనీర్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్ మెన్ లు, గ్రామ ...