వినియోగదారుల సేవల్లో ఉత్తమ ప్రతిభ : గోదావరిఖని ఏడీఈ వెంకటేశ్వర్లుకు టీఎస్ ఎన్పీడీసీఎల్ సీ & ఎండీ ప్రశంసా పత్రం.. *
(ఇది మన హక్కు సమాచార పత్రిక )గోదావరిఖని
వినియోగదారుల సేవల్లో ఉత్తమ ప్రతిభ : గోదావరిఖని ఏడీఈ వెంకటేశ్వర్లుకు టీఎస్ ఎన్పీడీసీఎల్ సీ & ఎండీ ప్రశంసా పత్రం.. *
*హన్మకొండ :** హన్మకొండ నక్కలగుట్టలోని తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSNPDCL) కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలలో విశేష ప్రగతి సాధించి, వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించినందుకుగాను గోదావరిఖని ఏడీఈ **వెంకటేశ్వర్లుకు** సంస్థ సీ & ఎండీ **కర్నాటి వరుణ్ రెడ్డి** ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థలో సమర్థవంతమైన నిర్వహణ, వినియోగదారుల సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర, ప్రజలతో మమేకమై సేవలందించడం వంటి అంశాల్లో ఏడీఈ వెంకటేశ్వర్లు చూపిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించడం గర్వకారణమని అధికారులు పేర్కొన్నారు. కాగా **‘వెంకన్న’**గా సుపరిచితులైన ఏడీఈ వెంకటేశ్వర్లు ప్రశంసా పత్రం అందుకోవడంపై సంస్థ ఉద్యోగులు, సహచరులు, ఆయన శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు..
కామెంట్లు