📍 గోదావరిఖని.. (ఇది మనహక్కు సమాచార పత్రిక..)
గోదావరిఖని వన్టౌన్ పరిధిలో పేకాట స్థావరం పై దాడి.. ఏడుగురి అరెస్ట్..
గోదావరిఖని,మారుతి నగర్, పరిధిలో ఒక వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించారు..వన్ టౌన్ ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి రూ.17,320 నగదు, 6 సెల్ఫోన్లు, రెండు సెట్ల పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు...
ఇది మన హక్కు సమాచార పత్రిక
మేనేజింగ్ డైరెక్టర్ &ఎడిటర్
(వడ్లకొండ మహేందర్ గౌడ్)
కామెంట్లు