వర్షాకాలం దృష్ట్యా ఓపెన్ డ్రైనేజీల పూడిక తొలగింపు పనులు
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
వర్షాకాలం దృష్ట్యా ఓపెన్ డ్రైనేజీల పూడిక తొలగింపు పనులు
గౌరవ రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గారు మరియు నగర మేయర్ మహంకాళి స్వామి గారి ఆదేశాల మేరకు, వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో జంగాలపల్లి ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గత ఐదు సంవత్సరాలుగా పూడిక తీయని కారణంగా మట్టితో నిండిపోయిన ఓపెన్ డ్రైనేజీలను జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో పూర్తిస్థాయిలో శుభ్రపరిచి పూడికను తొలగించారు.
ఈ చర్యల ద్వారా వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా చేయడంతో పాటు, నీటి నిల్వల వల్ల ఏర్పడే దోమలు, వ్యాధులు మరియు ప్రజలకు కలిగే ఇబ్బందులను నివారించేందుకు చర్యలు తీసుకున్నారు. స్థానిక ప్రజలు ఈ పనులను స్వాగతిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా డ్రైనేజీల శుభ్రత పనులు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
కామెంట్లు