అనారోగ్యంతో చెందిన జంపాల కనక లక్ష్మి ఆఖరి మజిలీ యాత్రకు చేయూతనిచ్చిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
అనారోగ్యంతో చెందిన జంపాల కనక లక్ష్మి ఆఖరి మజిలీ యాత్రకు చేయూతనిచ్చిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ ఎలుకలపల్లి కి చెందిన జంపాల కనక లక్ష్మి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ వైద్యం తీసుకుంటూ ఆదివారం రాత్రి మరణించినట్లు స్థానికులు తెలిపారు కనక లక్ష్మి అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేక కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతుండగా అక్కడ యువకులు తల కొన్ని డబ్బులు చందాలు వేసుకొని కనక లక్ష్మి కుటుంబానికి అండగా నిలిచారు పాడే కు సంబంధించిన సామాన్లు కొరకు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ ను ఆశ్రయించగా అంతిమయాత్రకు కావలసిన పాడే సామాన్లు పంపించినట్లు ఎలుకలపల్లి స్థానికులు తెలిపారు కనక లక్ష్మి కుటుంబం పరిస్థితి తెలుపగానే సహాయం చేయడానికి ముందుకొచ్చిన యువతకు మరియు సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నకు మరియు ఫౌండేషన్ సభ్యులందరికీ బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
కామెంట్లు