పీఆర్పీ బకాయిలు, వేతన సవరణ కోసం సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
పీఆర్పీ బకాయిలు, వేతన సవరణ కోసం సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
రామగుండం, జూన్ 29 (ఇది మన హక్కు): కోల్ ఇండియాతో సమానంగా పీఆర్పీ బకాయిలు, వేతన సవరణ, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMOAI) – SCCL బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్జీ-1 ఏరియా అధికారులు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. జూన్ 29 నుంచి జూలై 13 వరకు జీఎం కార్యాలయం ఎదుట ఈ దీక్షలు కొనసాగనున్నాయి. తొలి విడతలో ఆర్జీ-1 ఇన్చార్జి అధ్యక్షుడు డా. విష్ణుమూర్తి, ప్రధాన కార్యదర్శి కోల మల్లేశంతో పాటు అధికారులు దీక్షలో పాల్గొన్నారు. 2022-23 నుంచి 2024-25 వరకు పీఆర్పీ బకాయిల విడుదల, కోల్ ఇండియా తరహాలో పే అప్గ్రేడేషన్, సమాన అలవెన్సులు, IIT/IIM ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కోల మల్లేశం హెచ్చరించారు. కార్యక్రమంలో SCCL బ్రాంచ్ అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులు, ఉపాధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాస్, రమేష్, సల్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు