వీరనారి ఝల్కారీ బాయి చరిత్రకు తగిన గుర్తింపు ఇవ్వాలి: డా. మార్షల్ దుర్గం నగేష్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
వీరనారి ఝల్కారీ బాయి చరిత్రకు తగిన గుర్తింపు ఇవ్వాలి: డా. మార్షల్ దుర్గం నగేష్
ఎన్టీపీసీ, జూన్ 23 (ఇది మన హక్కు): 1857 తొలి స్వాతంత్ర్య సమరంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణత్యాగం చేసిన దళిత వీరనారి ఝల్కారీ బాయి కోరీ చరిత్రను వెలుగులోకి తీసుకురావాలని సమత సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. మార్షల్ దుర్గం నగేష్ కోరారు.
ఝల్కారీ బాయి 168వ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటంలో దళితులు, బహుజనులు, ఆదివాసీలు చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ సైన్యాన్ని మభ్యపెట్టేందుకు రాణి లక్ష్మీబాయి వేషంలో యుద్ధరంగంలోకి దిగి అపూర్వ సాహసం చేసిన ఝల్కారీ బాయి సేవలను చరిత్రలో మరుగున పడేశారని అన్నారు.
ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు జయంతి, వర్థంతులను ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి వీరుడు, వీరనారికి సమాన గౌరవం లభించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని డా. మార్షల్ దుర్గం నగేష్ పేర్కొన్నారు.
కామెంట్లు