అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం.. జాప్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు: అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం.. జాప్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు: అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ
రామగుండం, జూన్ 24 (ఇది మన హక్కు): నగరంలో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ ఆదేశించారు.
మంగళవారం ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పని పూర్తైన వెంటనే సైట్ను పూర్తిగా శుభ్రపరిచి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా పనులను సకాలంలో పూర్తి చేయాలని, సరైన కారణం లేకుండా జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఏఈలు తేజస్విని, మనోజ్, అన్వేష్, టెక్నికల్ ఆఫీసర్ సౌమ్య, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
కామెంట్లు