రైతు భరోసా కు రైతులు నూతన దరఖాస్తులు తప్పనిసరి చేసుకోవాలి- మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
రైతు భరోసా కు రైతులు నూతన దరఖాస్తులు తప్పనిసరి చేసుకోవాలి- మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం మండల కేంద్రంలోని గ్రామ రైతులు రైతు భరోసా కు నూతన దరఖాస్తులు గడువు తేదీలోపుచేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ అంతర్గం రైతు సోదరులు తేదీ 15/6/2026 వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు గతంలో పట్టాదారు పాసుపుస్తకం పొంది రైతుభరోసా కు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నవారు. గతం లో బ్యాంక్ ఖాతా సమస్య వలన డబ్బులు జమకాని రైతులు,రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. చేసుకోవడానికిరైతులు
పట్టాదార్ పాస్ పుస్తకం, జిరాక్స్,ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్, రైతు భరోసా దరఖాస్తు ఫారంతో మీ దగ్గరలోని రైతు వేదికల్లో ఏఈఓ దగ్గర తేదీ 4/7/2026 లోపు దరఖాస్తుచేసుకోవాలని రైతులకు మండలవ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ తెలిపారు.
కామెంట్లు