సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన, ఎనుమ రేషన్ పారంలు పంపిణీ చేసిన- గ్రామ పరిపాలన అధికారి మర్రి శంకర్ స్వామి
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన, ఎనుమ రేషన్ పారంలు పంపిణీ చేసిన- గ్రామ పరిపాలన అధికారి మర్రి శంకర్ స్వామి
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లోని లింగాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ పరిపాలన అధికారి మర్రి శంకర్ స్వామి ఎనుమరేషన్ ఫారంలో పంచడం, రైతులు సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పరిపాలన అధికారి మర్రి శంకర స్వామి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఓటరు వారికి ఇచ్చిన ఏనుమరేషన్ ఫారం ను బిఎల్ఓ, బిఎల్ఎ సహాయంతో తప్పులు లేకుండా నింపి సంబంధిత బి ఎల్ ఓ కు ఇవ్వవలెను అని, రైతులు సాదా బైనామా దరఖాస్తు చేసుకున్న రైతు భూమి చుట్టుపక్కల రైతుల వాంగ్మూలంఇప్పించవలసినదిగా అంతర్గాం మండల రెవెన్యూ గ్రామ పరిపాలన అధికారి, గ్రామ పరిపాలన సంఘం జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ స్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పరిపాలన అధికారి, గ్రామ పరిపాలన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ స్వామి,బి ఎల్ ఓ లు రైతులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కామెంట్లు