ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించండి – కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించండి – కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్
రామగుండం, జూన్ 28 (ఇది మన హక్కు): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్లోని లక్ష్మీపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మానికేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొని 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని, ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించకుండా మిగిలిపోకూడదని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మానికేశ్వర్ రెడ్డి, సీఓ పారిజాతం, ఏఎన్ఎం అనూష, బండి సాయి, యాదన్న, పెద్ద మల్లేశం, మహిళలు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
కామెంట్లు