జై భారత్ ఎస్సీ పోరాటవేదిక రాష్ట్ర,ఉపాధ్యక్షులుగా బొంకూరి మధు ఎన్నికజై
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
జై భారత్ ఎస్సీ పోరాటవేదిక రాష్ట్ర,ఉపాధ్యక్షులుగా బొంకూరి మధు ఎన్నిక
జై భారత్ సామాజిక విప్లవ రణభేరి తెలంగాణ రాష్ట్ర స్థాయి నాయకుల కార్యకర్తల సదస్సు జరిగింది, హైదరాబాద్ ఎల్బీనగర్ లోని ఖదిజ్ఞాసి ఆశ్రమంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు, కుల నిర్మూలన, సాధికారత సామాజిక న్యాయం కోసం అహర్నిశలు సంస్థ పనిచేస్తుంది, జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణ మూర్తి, జై భారత్ సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర అధ్యక్షులు జీవన్ జోయల్, నాయకులకు కార్యకర్తలకు కార్యక్రమాల నిర్వహణ విషయంలో దిశ నిర్దేశం చేశారు అనంతరం,జై భారత్ సంస్థ ఆధ్వర్యంలో జై భారత్ ఎస్సి పోరాట వేదిక తెలంగాణ రాష్ట్ర నూతన jనాయకత్వాన్ని ఎన్నుకున్నారు, జై భారత్ ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బొంకూరి మధు తో పాటు రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, తన ఎన్నికకు కృషిచేసిన సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర అధ్యక్షులు జీవన్ జోయల్ కు, బొంకూరి మధు కృతజ్ఞతలు తెలిపారు,అధ్యక్షులుగా మధు, ప్రధాన కార్యదర్శిగా గణేష్ గళ్ళ ఉపాధ్యక్షులుగా బొంకూరి,మధు నోసిన కోటయ్య, రాజు, కార్యదర్శులుగా లక్ష్మేశ్వర్ దున్న, శ్రీకాంత్, కమిటీ సభ్యులుగా గాలి కోటి సురేష్ తగరం,మోహన్, నందిని లక్ష్మీ శ్రీ నేతాజీ సునర్కర్, మార్గ నిర్దేశక సలహా మండలి ఖదిజ్ఞాసి యోధ విజయ విహారం రమణమూర్తి, యోధ రజిని, ఖదిజ్ఞాసి యోధ లోకనాథ్ వ్యవహరిస్తారని ఖదిజ్ఞాసి యోధ విజయ విహారం రమణమూర్తి ప్రకటించారు
కామెంట్లు