ప్రమాదం లో గాయపడి మరణించిన యువకుని ఆఖరి మజిలీ యాత్రకు సహాయం చేసిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
ప్రమాదం లో గాయపడి మరణించిన యువకుని ఆఖరి మజిలీ యాత్రకు సహాయం చేసిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50వ డివిజన్ అశోక్ నగర్ కు చెందిన జంగా సాకేత్ 22 సంవత్సరాల యువకుడ్ని శుక్రవారం రాత్రి గంగానగర్ బ్రిడ్జి సమీపంలో డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో త్రీవ గాయాలు కావడంతో సాకేత్ ను వెంటనే స్థానికులు గోదావరిఖని ఏరియా హాస్పిటల్ తరలించగా శనివారం ఉదయం మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు జంగా సాకేత్ అంత్యక్రియలు శనివారం జరుగుతుండగా సహాయం కోరుతూ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ చేసి తెలపడంతో వెంటనే స్పందించిన మల్లేష్ పాడే కు కావలసిన సామాన్లు అందజేసినట్లు సాకేత్ కుటుంబ సభ్యులు తెలిపారు సహాయం కోరిన వెంటనే దాతృత్వాన్ని చాటిన సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు మరియు ఫౌండేషన్ సభ్యులకు మృతుడి కుటుంబంతో పాటు 50వ డివిజన్ కార్పొరేటర్ దూళికట్ట సతీష్ కృతజ్ఞతలు తెలిపారు
కామెంట్లు