సింగరేణిలో బొగ్గు అక్రమ రవాణాకు తావులేదు.. పారదర్శక వ్యవస్థపై భట్టి విక్రమార్క సంతృప్తి
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
సింగరేణిలో బొగ్గు అక్రమ రవాణాకు తావులేదు.. పారదర్శక వ్యవస్థపై భట్టి విక్రమార్క సంతృప్తి
శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మీడియా సమక్షంలో నిర్వహించిన ఓపెన్ హౌస్ తనిఖీలో బొగ్గు ఉత్పత్తి నుంచి రవాణా వరకు అన్ని ప్రక్రియలను ప్రత్యక్షంగా పరిశీలించారు. సింగరేణిలో అమలవుతున్న జీపీఎస్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్, ఎస్ఏపీ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు బొగ్గు ఉత్పత్తి, నిల్వ, రవాణా ప్రక్రియలపై వివరించారు. ప్రతి వాహనం కదలిక, లోడింగ్, డిస్పాచ్ ప్రక్రియలు సీసీటీవీలు, డిజిటల్ వ్యవస్థల ద్వారా నిరంతరం పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం ఉంటే ప్రభుత్వం సరిదిద్దేందుకు సిద్ధంగా ఉందన్నారు. దీనికి స్పందించిన అధికారులు బొగ్గు అక్రమ రవాణా, దొంగతనాలకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణి కార్మికుల శ్రమ, సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే నిరాధార ఆరోపణలు సరికావన్నారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, పారదర్శకత, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
కామెంట్లు