సైడ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ గుంట బాపు
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
సైడ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ గుంట బాపు
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం సోమనపల్లి గ్రామంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సహకారంతో సైడ్ డ్రైనేజీ పనులను గ్రామ సర్పంచ్ గుంట బాపు ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ గుంట బాపు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు నేను ఇచ్చినటువంటి హామీలను ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సహకారంతో గ్రామంలో ఎలాంటి చిన్న సమస్య ఉన్నా, ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చిన కూడా నాకు తెలిపిన మీ సమస్యను పరిష్కారం చేస్తానని రాబోయే కాలంలో మన గ్రామాన్ని మండలంలోని మొదటి ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ గుంట బాపు తెలిపారు. అనంతరం గ్రామంలో సైడ్ డ్రైనేజీలు లేక వర్షాకాలం వర్షపు నీరు వచ్చినప్పుడు, అలాగే ఇండ్లలో వాడేమురికి నీరు రోడ్డు పైకి చేరి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇళ్లలోకి చేరటం జరుగుతుంది.దీనికి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ నిసంప్రదించిమాసమస్యవిన్నవించుకోవడంతో వెంటనే ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ స్పందించి సి ఆర్ ఆర్, ఎస్ డి ఎఫ్,డి ఎం ఎఫ్ టి నిధుల ద్వారా 25 లక్షల రూపాయలు గ్రామ సైడ్ డ్రైనేజ్ పనులకు కేటాయించడం ద్వారా, సైడ్ డ్రైనేజీలను ప్రారంభించడం జరిగింది. దీనికి మా గ్రామ ప్రజల పక్షాన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు గ్రామ సర్పంచ్ గుంట బాపు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుంట బాపు, ఉప సర్పంచ్ ఎర్రోజ్ సత్యనారాయణ, వార్డు సభ్యులు శంకరమ్మ,నీలమ్మ, పంచాయతీ కార్యదర్శి కిషోర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుంట హనుమంతు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు ఆకుతోట కొమురయ్య, రాజయ్య, లచ్చయ్య, మద్దిరాల రవీందర్ రెడ్డి, సూర సురేష్, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కామెంట్లు