ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రైతుల సౌకర్యార్థం రూ.5 లక్షలతో మట్టి రోడ్డు మరమ్మత్తు పనులకు శ్రీకారం– పనులు ప్రారంభించిన ఆకెనపల్లి సర్పంచ్ గాదె స్రవంతి–సుధాకర్

 ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రైతుల సౌకర్యార్థం రూ.5 లక్షలతో మట్టి రోడ్డు మరమ్మత్తు పనులకు శ్రీకారం
– పనులు ప్రారంభించిన ఆకెనపల్లి సర్పంచ్ గాదె స్రవంతి–సుధాకర్

అంతర్గాం: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు అంతర్గాం మండలంలోని ఆకెనపల్లి గ్రామంలో రైతుల సౌకర్యార్థం రూ.5 లక్షల ప్రత్యేక నిధులతో మట్టి రోడ్డు మరమ్మత్తు పనులను గ్రామ సర్పంచ్ గాదె స్రవంతి–సుధాకర్ ఘనంగా ప్రారంభించారు. జేసీబీ, ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో రోడ్డు మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గాదె స్రవంతి మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతున్నామని తెలిపారు. వర్షాకాలంలో రైతులు తమ పొలాలకు ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు ఈ రహదారి మరమ్మత్తు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమం, గ్రామాభివృద్ధే తమ లక్ష్యమని, నాణ్యతతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు.

ఈ రహదారి అందుబాటులోకి రావడంతో వందల ఎకరాల రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగాధరి శ్రీనివాస్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మర్రి రాజ్‌కుమార్, పూదరి స్వామి, ఇతనవేణి రామ్మూర్తి, మెరుగు రవి, ఆకుల రాము, సామల కుమార్, సామల అభి, అగ్గి భూమేష్, రైతులు, యువకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...