సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి: ఏఐటీయూసీ

✍️ఇది మన హక్కు సమాచార పత్రిక మండల రిపోర్టర్

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి: ఏఐటీయూసీ

రామగుండం, జూన్ 19 (ఇది మన హక్కు): సింగరేణి అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, ఈఎస్ఐ సౌకర్యాన్ని వెంటనే కల్పించాలని ఏఐటీయూసీ రామగుండం నగర అధ్యక్షుడు అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రామగుండం ఏరియా-1 పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోల్ ఇండియా తరహాలో సింగరేణిలో కూడా కాంట్రాక్ట్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హైలీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్ అమలు, ప్రతి నెల మొదటి వారంలో వేతనాల చెల్లింపు, పీఎఫ్ వివరాల వెల్లడితో పాటు జీత స్లిప్పులు అందించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించిన వారు, సమస్యలు పరిష్కరించకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలు చేపట్టి జీఎం కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.

ఇది మన హక్కు సమాచార పత్రిక..

 మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఎడిటర్

 వడ్లకొండ మహేందర్ గౌడ్


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...