దేశవ్యాప్తంగా 23వ విడత పి.ఎం కిసాన్ నిధులు విడుదల చేసిన-కెవికె రామగిరి హెడ్ వెంకట రమేష్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
దేశవ్యాప్తంగా 23వ విడత పి.ఎం కిసాన్ నిధులు విడుదల చేసిన-కెవికె రామగిరి హెడ్ వెంకట రమేష్
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి రైతు వేదికలో పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని పాలకుర్తి రైతుల తో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్,కెవికె రామగిరి ఖిల్లాశాస్త్రవేత్తలు,బృందం,వ్యవసాయ శాఖ పాలకుర్త ద్వారా రైతులకు వివిధ వ్యవసాయ పద్ధతుల్లో పై అవగాహన ఇందులో కల్పించారు. పాలకుర్తి రైతు వేదికలో సాయంత్రం 4 గంటల నుండి పీఎం కిసాన్ నిధుల ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో పిఎం కిసాన్ 23 వ విడత నిధుల విడుదలను ప్రధాని చేతులు మీదుగా అట్టహాసంగా జరిగింది. పాలకుర్తి మండలంలో 3724 రైతు ఒక్కో కుటుంబాలకు ఈ విడత రూ: 2000 చొప్పున నేరుగా ఖాతా లో జమా.రైతు సోదరులు అర్హత ఉండి ఇప్పటికీ పిఎం కిసాన్ రానివారు , పీఎం కిసాన్ పై సందేహాల ఉన్నవారు.పీఎం కిసాన్ లబ్ధిదారులు, అభ్యుదయ రైతులు సందేహాలు నివృత్తి చేశాము మరియు కేవైసీ, ఈ కేవైసీ లేదా భూమి వివరాలపై ఏవైనా సందేహాలు ఉన్న రైతులు ఈ సమావేశానికి హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ఈ కార్యక్రమం లో వ్యవసాయ విస్తరణ అధికారులు పాలకుర్తి ఎం సువర్ణరేఖ , జయ్యారం ఏఈఓ కే .శ్రీకాంత్ , గూడూరు ఏఈఓ జే.సుష్మ , మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ , డి ఎఓ జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్ కెవికె హెడ్, డాక్టర్ వెంకట రమేష్, రామగిరి ఖిల్లా శాస్త్రవేత్తలు కిరణ్ , డాక్టర్ వై వెంకన్న , డాక్టర్ టి.వినోద్, రైతులు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్లు