పెద్దంపేట రచ్చగుట్టను కాపాడాలి – తవ్వకాల అనుమతులు వెంటనే రద్దు చేయాలి: CPI ML మాస్ లైన్ ప్రజాపంథాపెద్దంపేట
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టు ✍️
పెద్దంపేట రచ్చగుట్టను కాపాడాలి – తవ్వకాల అనుమతులు వెంటనే రద్దు చేయాలి: CPI ML మాస్ లైన్ ప్రజాపంథా
అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో మంగళవారం CPI ML మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గాం మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, జిల్లా నాయకులు ఆడేపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య పాల్గొని మాట్లాడారు.
పెద్దంపేట గ్రామానికి ప్రకృతి సంపదగా, చారిత్రక ప్రాధాన్యం కలిగిన రచ్చగుట్టను అక్రమంగా తవ్వుతూ మట్టిని తరలించడం తీవ్ర ఆందోళనకరమని వారు పేర్కొన్నారు. రైల్వే, రోడ్డు పనుల పేరుతో రచ్చగుట్టను కనుమరుగు చేసేందుకు ప్రభుత్వం, కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
రచ్చగుట్టను కాపాడుతామని అధికార పార్టీ, గ్రామ పాలకవర్గం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, మాటలకే పరిమితం కాకుండా తక్షణమే తవ్వకాలను నిలిపివేసే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ పాలకవర్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ, కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఇప్పటికీ తవ్వకాలు కొనసాగడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతంలో ఇప్పటికే కాలుష్యం పెరిగి ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపుతోందని, పెద్దంపేట రచ్చగుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. పోరాట వారసత్వం కలిగిన పెద్దంపేట గ్రామ ప్రజలంతా రచ్చగుట్ట రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో గూడూరు వైకుంఠం, తూల్ల శంకర్, మాజీ సర్పంచ్ మార్త రాద, కోడిపుంజుల లక్ష్మి, బుర్ర బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు