రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించిన- మండల వ్యవసాయ అధికారి కే సతీష్
ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించిన- మండల వ్యవసాయ అధికారి కే సతీష్
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామ రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి సతీష్ కుమార్ అధ్యక్షతన జమ్మికుంట శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట శాస్త్రవేత్త డాక్టర్ జి స్వాతి మాట్లాడుతూ రైతులను ఉద్దేశించి రైతుల వద్దకే శాస్త్రవేత్తలు అనే నినాదంతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం పై రైతులకు అవగాహన కల్పిస్తూ పండించే పంటను ఏ విధంగా పండించాలో, పండించే పంటకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పంట వేసిన నుండి పంట చేతి కందే వరకు పంటను ఏ పద్ధతిలో పండించాలో, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి శాస్త్రవేత్త డాక్టర్ జి స్వాతి రైతులకు కొన్ని ముఖ్యమైన సలహాలను సూచించడం జరిగింది. ముఖ్యమైన సలహాలు 1) పంటకు యూరియా వాడకం తగ్గించాలని, నాను ఎరువులు వాడాలని పంట మార్పిడి పాటించాలని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు మాత్రమే సాగు చేయాలని, సాగునీటిని ఆదా, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించాలని మనం పండించే పంటకు ఏ కాలంలో ఎలాంటి మందులు వాడాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలా పద్ధతులు పాటించినప్పుడే మనకు అనుకున్న విధంగా పంట చేతికి వస్తుందని పంటకు ఎలాంటి నష్టం కలగదని శాస్త్రవేత్త డాక్టర్ జి స్వాతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే సతీష్, ఏ ఈ ఓ ఎన్ హరీష్, డాక్టర్ జి స్వాతి, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు