బండి సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా
ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
బండి సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా
మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్టు చేసి నిష్పక్షపాత విచారణ జరపాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.
కేసు నమోదై రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాల్సి ఉండగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాజకీయ, ఆర్థిక పలుకుబడిని ఉపయోగించి కేసును ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధిత బాలికకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించి, కేసును నిష్పక్షపాతంగా విచారించాలని కోరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
జూపాక శ్రీనివాస్, గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, తోకల రమేష్ ఈ ప్రకటన విడుదల చేశారు.
కామెంట్లు