కేసీఆర్ పాలనలో రైతులు రాజులుగా.. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమాగం వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

కేసీఆర్ పాలనలో రైతులు రాజులుగా.. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమాగం
వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతాంగం రాజుల్లా బతికారని, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో రైతుల జీవితాలు ఆగమాగమయ్యాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. శనివారం టీటీఎస్ అంతర్గాం, పెద్దంపేట గ్రామాల వరి కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతులను ఆదుకునే ధ్యాస లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో సకాలంలో ఎరువులు, రైతుబంధు, ధాన్యం కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారని గుర్తు చేశారు.
20 రోజులుగా ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉండటంతో అకాల వర్షాలకు తడిసి రైతులకు నష్టం జరుగుతోందని, బస్తాల్లో కిలోల కోతలతో ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గోపు అయులయ్య యాదవ్, ఆముల శ్రీనివాస్, కరివేద స్రవంతి శ్రీనివాస్ రెడ్డి, కోలా సంతోష్, కొలిపక శరణ్య మధుకర్ రెడ్డి, బండారి ప్రవీణ్, ధరణి రాజేష్, తుంగపిండి సతీష్, బండి మహేష్ గౌడ్, బోడ్డుపల్లి శ్రీనివాస్, ఎలుక కొమురయ్య, కాంపల్లి సంతోష్, విష్ణు, సుబ్రహ్మణ్యం, కాంపల్లి రాజేష్, అవునూరి ప్రశాంత్, గోర్క సంతోష్, దొమ్మేటి వాసు, ఈదునూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...