వర్షాకాల సమస్యలపై ముందస్తు చర్యలు చేపట్టాలి : కార్పొరేటర్ నెలకంటి రాము
గౌరవ శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు 38వ డివిజన్ కార్పొరేటర్ నెలకంటి రాము డివిజన్ సివిల్ ఇంజనీర్ను వెంట తీసుకుని డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు.
🔹 గల్లీ గల్లీ తిరిగి సమస్యాత్మక ప్రాంతాల పరిశీలన
🔹 వర్షాలతో ఇబ్బంది కలిగే ప్రాంతాల గుర్తింపు
🔹 తక్షణమే సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు
🔹 ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళిక
ఈ సందర్భంగా కార్పొరేటర్ నెలకంటి రాము మాట్లాడుతూ, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సూచనల మేరకు ప్రతి లైన్లో తిరిగి వర్షాల సమయంలో ఇబ్బందులు కలిగే ప్రాంతాలను గుర్తించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో AE అన్వేష్, డివిజన్ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు, వార్డు ఆఫీసర్ సాయి, పెళ్లి కులస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నీలకు సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు