పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రంపెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్
ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.
సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్ ఒక ప్రకటన లో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని,
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచడం వల్ల సామాన్య ప్రజల తోపాటు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చిన్న, చిన్న వ్యాపారులపై పెను భారం పడుతుందని అన్నారు. పెట్రో ధరలు పెరగడం వలన నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని అన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా,అట్టి ప్రయోజనాన్ని ప్రజలకు అందించకుండా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చడమే ధ్యేయంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పనిచేస్తున్నదని విమర్శించారు.
ఇప్పటికే గ్యాస్ కోరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై పెట్రోల్ డీజిల్ ధరల రూపంలో మరో భారాన్ని మోపారని ఆయన ధ్వజమెత్తారు.
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించి, పాత ధరలను పునరుద్ధరించి
పేద ప్రజలపై భారం పడకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలనీ,
కేంద్రం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
కామెంట్లు