జూల వంశీ హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలివంశీ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
జూల వంశీ హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలి
వంశీ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన జూల వంశీని దారుణంగా హత్య చేసిన వారిపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.
ఆదివారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కవ్వంపెళ్లి సతీష్, ఇరుగురాల భాగ్యలక్ష్మి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ సింగిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి జూల వంశీ కుటుంబ సభ్యులను పరామర్శించి, జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రేమ వ్యవహారం నేపథ్యంలో జరిగిన ఈ హత్యలో గౌడ సామాజిక వర్గానికి చెందిన నీలం అలేఖ్యకు పూర్తి స్థాయిలో పాత్ర ఉందని ఆరోపించారు. ప్రేమ వ్యవహారం బయటపడటంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం అలేఖ్య భర్త ముండూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నీలం నవీన్, నీలం అలేఖ్య, ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బుర్ర భాస్కర్తో పాటు మరికొందరు కలిసి హైదరాబాద్లో హత్య చేసి, మంథని సమీపంలోని గాడిదల గండిలో మృతదేహాన్ని పడవేశారని పేర్కొన్నారు.
ఇంత దారుణమైన హత్యను ముగ్గురే చేయలేరని, మరికొందరి ప్రమేయం కూడా ఉండే అవకాశముందని, నిష్పక్షపాత విచారణ జరిపి ఇందులో పాల్గొన్న వారందరినీ గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో హత్య చేసి కారులో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మృతదేహాన్ని పడవేయడం వెనుక మరికొందరి సహకారం ఉండే అవకాశం ఉందని, వారిని తప్పించే ప్రయత్నాలు జరగకుండా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.
జూల వంశీ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించడంతో పాటు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
కామెంట్లు