దివ్యాంగులకు త్రి చక్ర వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
దివ్యాంగులకు త్రి చక్ర వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మోటరైజ్డ్ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 20 మంది లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఉచిత వాహనాల పంపిణీ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి, వారి స్వావలంబనకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించే దిశగా నిరంతరం కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.
వాహనాలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఇతరులు పాల్గొన్నారు.
కామెంట్లు