ఏఐటీయూసీ మండల మహాసభలను విజయవంతం చేయాలి: కడారి సునీల్
ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
ఏఐటీయూసీ మండల మహాసభలను విజయవంతం చేయాలి: కడారి సునీల్
పెద్దపెల్లి జిల్లా 14 మండలాల్లో ఏఐటీయూసీ నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు మే 12 నుంచి జూన్ 10 వరకు మండల మహాసభలు నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ పిలుపునిచ్చారు.
మండలాల్లోని హమాలీలు, గ్రామపంచాయతీ కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో పాటు వివిధ విభాగాల కార్మిక సంఘాలను కలుపుకుని మండల నిర్మాణాన్ని పటిష్టం చేయాలని కోరారు. దేశంలో కార్మిక చట్టాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో కార్మికులపై పని భారం పెంచి, ఉద్యోగ భద్రతను దెబ్బతీయడానికి పెట్టుబడిదారులు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
44 కార్మిక చట్టాలను రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపైనే ఉందని పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర మహాసభల సందర్భంగా అన్ని మండలాల్లో ఏఐటీయూసీని విస్తరించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల నాయకత్వం సమన్వయంతో మహాసభలను విజయవంతం చేయాలని సూచించారు.
కామెంట్లు