పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించిన- తేనుగు ముదిరాజు సంఘం కులస్తులు
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించిన- తేనుగు ముదిరాజు సంఘం కులస్తులు
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలో తేనుగు ముదిరాజు కులస్తులు పెద్దమ్మ తల్లికి ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లికి పట్నాలు వేసి బోనాలు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తేనుగు ముదిరాజ్ కులస్తులు మాట్లాడుతూ మేము మా కుటుంబ సమేతంగా ప్రతి ఏటా ఇష్ట కులదైవంగా భావించే పెద్దమ్మ తల్లికి ప్రతి ఏటా ప్రతి ఇంటిలో బోనం వండుకొని బోనం ఎత్తుకొని డప్పు చప్పులతో వాడ వాడల తిరుగుతూ అమ్మవారి గుడికి చేరుకొని అమ్మవారికి పట్నాలు వేసి, బోనాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం అమ్మ భగవాన్ సేవా సమితి కార్యనిర్వాహకులు పెసర్ శంకర్ తన సొంత ఖర్చులతో అమ్మవారి మొక్కలు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులకు పండ్లు, చల్లటిమంచినీటి అందించడం జరిగిందని అమ్మ భగవాన్ సేవాసమితి కార్యనిర్వాహకులు పెసర్ శంకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తేలును ముదిరాజ్ కులస్తులు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్లు