చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణకు ఐక్య పోరాటం అవసరం44 కార్మిక చట్టాల రక్షణ కోసం ఐక్య పోరాటం అవసరం — ఏఐటీయూసీ
ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణకు ఐక్య పోరాటం అవసరం
44 కార్మిక చట్టాల రక్షణ కోసం ఐక్య పోరాటం అవసరం — ఏఐటీయూసీ
రామగుండం నాయకులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ పిలుపు
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్లో మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు చిలువేరి లక్ష్మీనారాయణ జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే ఆర్టీసీ డిపో మరియు మెడికల్ కాలేజీ మెయిన్ చౌరస్తాలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోషిక మోహన్ జెండా ఎగురవేశారు. నగరమంతా ఎర్ర జెండాలతో కళకళలాడింది.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్, ఆర్ఎంఓలు డాక్టర్ రాజు, డాక్టర్ అప్పారావు, డాక్టర్ తిరుమలేషా, నర్సింగ్ సూపరింటెండెంట్ లీనా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ 1886లో అమెరికాలోని చికాగోలో జరిగిన కార్మిక ఉద్యమంలో అమరవీరుల త్యాగాల ఫలితంగా 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం హక్కులు సాధించబడినట్లు గుర్తు చేశారు. ఆ త్యాగాల స్ఫూర్తితోనే మే-డే ఏర్పడిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేయాలని చూస్తోందని, దీని వల్ల పనిగంటలు పెరగడం, పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ వంటి హక్కులు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మిక వర్గం ఐక్యంగా పోరాడి 44 కార్మిక చట్టాలను కాపాడాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. అదే చికాగో అమరవీరులకు నిజమైన నివాళి అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, మెడికల్ సిబ్బంది, నర్సులు, శానిటేషన్ కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది, ఏఐటీయూసీ నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
కామెంట్లు