భవన కార్మికుల హక్కుల కోసం మే 25న ఛలో హైదరాబాద్ కార్మికుల సొమ్ము ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించొద్దు ఆడెపు శంకర్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
భవన కార్మికుల హక్కుల కోసం మే 25న ఛలో హైదరాబాద్
కార్మికుల సొమ్ము ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించొద్దు ఆడెపు శంకర్
TUCI అనుబంధ తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీ, గోదావరిఖని, పెద్దంపేట లేబర్ అడ్డాల వద్ద “చలో హైదరాబాద్” వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు ఆడెపు శంకర్ మాట్లాడుతూ, 60 ఏళ్లు పైబడిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు ₹9 వేల పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల అమలుకు నియమించిన ప్రైవేట్ ఏజెన్సీల రీనివల్స్ నిలిపివేసి, ఆరోగ్య పరీక్షల పేరుతో కార్మికుల సొమ్మును దోచుకుంటున్న విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈఎస్ఐ ద్వారా ఆరోగ్య పథకాన్ని అమలు చేసి, సహజ మరణ పరిహారాన్ని ₹5 లక్షలకు పెంచాలని కోరారు.
అదేవిధంగా పెళ్లికానుక, డెలివరీ క్లెయిమ్స్ను ₹30 వేల నుంచి ₹1 లక్షకు పెంచి, పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని, నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేసి లేబర్ అడ్డాల వద్ద షెల్టర్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధన కోసం మే 25న హైదరాబాద్లోని విఎస్టీ నుంచి ఉదయం 10:30 గంటలకు భారీ ప్రదర్శన నిర్వహించి, లేబర్ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని తెలిపారు. కార్మికులంతా పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గొల్లపల్లి చంద్రయ్య, మార్త రాములు, కలవల రాజమల్లు, ఉడుత శ్రీనివాస్, కే బాబు, కే రాజేష్, ఎం సతీష్, కే నారాయణాద్రి, జి లక్ష్మణ్, భీమన్న, పెండ్యాల ఓదెలు, కే లింగయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు