21వ డివిజన్లో మెగా పీటీఎం, బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్.
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
21వ డివిజన్లో మెగా పీటీఎం, బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్
21వ డివిజన్ లక్ష్మీపూర్ గేట్ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు నిర్వహించిన మెగా పీటీఎం, బడిబాట కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, గౌరవ పాలకుర్తి మండల విద్యాధికారి విమల, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు..ఈ సందర్భంగా కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ డివిజన్ పరిధిలోని ప్రతి చిన్నారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు, స్థానికులకు విజ్ఞప్తి చేశారు..ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ ఎఫ్సీఐ, లక్ష్మీపూర్ ప్రాథమికోన్నత పాఠశాల, వీర్లపల్లి ప్రాథమిక పాఠశాల, ఎలుకలపల్లి ప్రాథమిక పాఠశాల, యూపీఎస్ ఎలుకలపల్లి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు విద్య ప్రాధాన్యతను వివరించారు..బడిబాట కార్యక్రమం ద్వారా ప్రతి చిన్నారి పాఠశాలలో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలని అవగాహన కల్పించారు.
కామెంట్లు