((పెద్దపల్లి జిల్లా రామగుండం)) రామగుండం రైల్వేస్టేషన్లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్.. రామగుండం రైల్వే స్టేషన్లో ధనపూర్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న నిండు గర్భిణీ మహిళకు అకస్మాత్తుగా ప్రసవ వేదనలు రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో అటుగా వెళ్తున్న గోదావరిఖని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ ఆఫీసర్ దవ రజిత రమ పరిస్థితిని గుర్తించి వెంటనే స్పందించారు.ఆమె ధైర్యసాహసాలతో రామగుండం రైల్వే స్టేషన్లోనే అత్యవసర చికిత్స అందించి, అక్కడికక్కడే సురక్షితంగా డెలివరీ నిర్వహించి తల్లి, శిశువు ఇద్దరి ప్రాణాలను కాపాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి రెండు నిండు ప్రాణాలను రక్షించిన నర్సింగ్ ఆఫీసర్ " దవ రజిత, రమ, ను ప్రయాణికులు, స్థానికులు అభినందించారు. . """మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘటన ప్రజల హృదయాలను హత్తుకుంది... **ఇది మన హక్కు సమాచార పత్రిక ** మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్ (( వడ్లకొండ మహేందర్ గౌడ్ ))
{✍️ఇది మన హక్కు సమాచార పత్రిక: గోదావరిఖని} పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్.. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ఆలస్యం జరుగుతుందనే నిరసనగా ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ నర్సంపేట బస్టాండ్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు..తీవ్ర గాయాలపాలైన ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఇది మన హక్కు సమాచార పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్ వడ్లకొండ మహేందర్ గౌడ్ ..
మాచినేని రమేష్ (మృతుని ఫైల్ ఫోటో ) ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ రామగుండం రైల్వే ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి రామగుండం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రామగుండానికి చెందిన మాచినేని రమేష్ (32) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామగుండం నివాసి అయిన మాచినేని రమేష్ అంతర్గాం మండలం ముర్ముర్ వద్ద గల మిషన్ భగీరథ పంప్ హౌస్లో ఆపరేటర్గా విధి నిర్వహణలో ఉన్నాడు. ఎప్పటిలాగే తన డ్యూటీ ముగించుకుని మోటార్ సైకిల్పై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో, రామగుండం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి రాగానే వెనుక నుండి అతివేగంగా వచ్చిన ఒక ట్రాన్స్పోర్ట్ బొలెరో వాహనం రమేష్ బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్ తలకు, చేతికి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అత్యవసర వాహనంలో అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రమేష్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న రామగుండం సబ్ ఇన్స్పెక్టర్ (SI) సంధ్యారాణి సంఘ...
ఇది మన హక్కు రామగుండం మండలం రిపోర్టర్✍️ 48వ డివిజన్లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు ఉదయం 6 గంటలకు రామగుండం మేయర్ శ్రీ మహంకాళి స్వామి గారు 99 రోజుల ప్రజా పాలన–పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా 48వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పర్యటనలో భాగంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన మేయర్ గారు రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి, తిరుపతి, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను మేయర్ గారికి వివరించారు.. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️
📍 గోదావరిఖని.. (ఇది మనహక్కు సమాచార పత్రిక..) గోదావరిఖని వన్టౌన్ పరిధిలో పేకాట స్థావరం పై దాడి.. ఏడుగురి అరెస్ట్.. గోదావరిఖని, మారుతి నగర్, పరిధిలో ఒక వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించారు..వన్ టౌన్ ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి రూ.17,320 నగదు, 6 సెల్ఫోన్లు, రెండు సెట్ల పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు... ఇది మన హక్కు సమాచార పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ &ఎడిటర్ (వడ్లకొండ మహేందర్ గౌడ్)
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: గోదావరిఖని వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక అనుమానితుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలి – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు గోదావరిఖని వన్టౌన్ పరిధిలోని లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు రామగుండం పోలీస్ కమిషనరేట్,పెద్దపల్లి జోన్,గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు, హోటళ్లలో ఈరోజు గోదావరిఖని వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి,ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక లాడ్జీలు,హోటళ్ల యజమానులు మరియు మేనేజర్లకు ఇన్స్పెక్టర్ పలు కీలక సూచనలు జారీ చేశారు. లాడ్జీలు,హోటళ్లలో బసకు వచ్చే ప్రతి వ్యక్తి పూర్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ముఖ్యంగా ఆధార్ కార్డు పరిశీలించాలని ఆదేశించారు.గది బుక్ చేసుకునే వ్యక్తుల పూర్తి చిరునామా, ఫోన్ నంబర్,గుర్తింపు వివరాలు నమోదు చేయాలని సూచించారు.అలాగే సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు.అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తులు కనిప...
Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక// ;; రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 60వ డివిజన్లో రెండు రోజులుగా డ్రైనేజీ జామ్ కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్కూల్కు వెళ్లే పిల్లలు దుర్వాసన, నీటి నిల్వల కారణంగా తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది...ఈ సమస్యపై కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు తక్షణమే స్పందించి మున్సిపల్ సిబ్బందిని రంగంలోకి దింపి డ్రైనేజీ శుభ్రత పనులు చేపట్టారు...సమస్యను వెంటనే పరిష్కరించడంలో కృషి చేసిన మున్సిపల్ అధికారులు, సిబ్బందిని అబ్బాస్ యాదవ్ అభినందించారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, పరిష్కారానికి కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన తెలిపారు...
రామగుండం నగరపాలక సంస్థ... ""**అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..** తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం మంగళ వారం రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా మంగళవారం ప్రచురించారు. అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , కమిషనర్ జె, అరుణ శ్రీ రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా ప్రదర్శించారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాకు సంబంధించి సలహాలు, సూచనలు ఈ నెల 14,15 తేదీలలో నగరపాలక సంస్థ కార్యాలయంలో లిఖితపూర్వకంగా సమర్పించవచ్చని ఆమె తెలిపారు.ఈ సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ , సెక్రెటరీ ఉమా మహేశ్వర్ రావు , అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు , ఎ సి పి. శ్రీ హరి , టి పి ఎస్ . నవీన్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు... ఇది మన హక్కు సమాచార పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర...
((ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని..)) రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా ""రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్.... జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అడ్ హాక్ కమిటీ సభ్యులు రావుల మధు ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి RK సాగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బరిలో ఉండబోయే అభ్యర్థుల జాబితా ప్రస్తుత వార్డుల వారీగా రాజకీయ సమీకరణలు ప్రాంత సమస్యలు తెలుసుకొని జనసేన గెలుపు కోసం కావలిసిన సూచనలు తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా ముందుకు వెళ్లాలి అని దానికి నియోజకవర్గం లోని జనసేన నాయకులు జనసైనికులు కృషి చేందుకు నియోజకవర్గం లో సమావేశం ఏర్పాటు చేయాలి అని తెలిపారు. వార్డ్ రిజర్వేషన్ ఖరారు అవ్వగానే కార్యాచరణ సిద్ధం చేద్దాం అని తెలిపారు.. ఇది మన హక్కు సమాచార పత్రిక .. మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్ వడ్లకొండ మహేందర్ గౌడ్
ఇది మన హక్కు సమాచార పత్రిక (టౌన్ రిపోర్టర్ ఆరుకల విక్రమ్) తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్లు... తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 2001 నుండి క్రియాశీలకంగా పనిచేస్తూ, పార్టీకి నిబద్ధతతో సేవలందించిన పొన్నం విజయ్ గౌడ్ (2వ డివిజన్) మరియు పొన్నం సుమలత (34వ డివిజన్) లకు బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం బి-ఫామ్లు కేటాయించడం తెలంగాణ ఉద్యమ సేవలకు వచ్చిన గౌరవంగా భావించాల్సిన విషయం..ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు పొందిన పొన్నం దంపతులకుమాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్,మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరు కంటి చందర్,కార్మిక నేత కౌశిక హరి, రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభిషేక్ తెలంగాణ ఉద్యమ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు..తెలంగాణ సాధన కోసం చేసిన త్యాగాలు, పోరాటాలు నేడు ఫలించడం సంతోషకరమని, రానున్న రోజుల్లో ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత సేవ చేయాలని వారు ఆకాంక్షించారు.. ఇది మన హక్కు సమాచార పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్ వడ్లకొండ మహేందర్ గౌడ్ ...
కామెంట్లు