జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో ధర్మారం మండల టీమ్ రన్నర్ కప్ విజయం..
పెద్దపల్లి జిల్లా ధర్మారం వార్తలు..
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో శుక్రవారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ పోటీల్లో ధర్మారం మండల టీమ్ రన్నర్ కప్ను గెలుచుకుంది.
ఈ సందర్భంగా కెప్టెన్ ప్రభాకర్, మండల ప్రెసిడెంట్ కంటేశ్వర్ మాట్లాడుతూ జట్టు సభ్యుల సమిష్టి కృషితో ఈ విజయం సాధ్యమైందని అన్నారు. సెమీఫైనల్లో అద్భుతంగా ఆడి జట్టును ఫైనల్కు చేర్చిన కొమ్మ పరమేష్ను టీం సభ్యులు, మండల ఫోటోగ్రాఫర్లు అభినందించారు. అలాగే తిరుపతి, అజయ్, బి. తిరుపతి మంచి ప్రదర్శన కనబర్చారని పేర్కొన్నారు...
కామెంట్లు