మంత్రుల పర్యటన ఏర్పాట్ల పరిశీలన – జూనియర్ కాలేజీ సభ స్థలిని సందర్శించిన కాంగ్రెస్ నేతలు..
@గోదావరిఖని న్యూస్..:
తేదీ:-09-01-2026
రామగుండం శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దుద్దిల్ల శ్రీధర్ బాబు,అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పర్యటన సందర్భంగా జూనియర్ కాలేజీలో నిర్వహించనున్న సభ స్థలిని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు...అనంతరం మీడియాతో మాట్లాడిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, ఈ పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నామని తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, గుండేటి రాజేష్, మరెల్లి రాజిరెడ్డి, గట్ల రమేష్, తిప్పరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు...
కామెంట్లు