మంత్రుల రాకకు ముస్తాబవుతున్న గోదావరిఖని – సంక్రాంతి శోభతో నగర సుందరీకరణ స్పెషల్ డ్రైవ్..
@కార్పొరేషన్ గోదావరిఖని న్యూస్...
ఈనెల 11వ తేదీన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గోదావరిఖనికి రానున్న నేపథ్యంలో నగరం సంక్రాంతి కొత్త అందాలతో ముస్తాబవుతోంది...ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) & కమిషనర్ జె. అరుణశ్రీ ఆదేశాల మేరకు, డిప్యూటీ కమిషనర్ నాయన వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ప్రత్యేక శుభ్రతా డ్రైవ్ చేపట్టారు...ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా రాజీవ్ రహదారిని మున్సిపల్ సిబ్బందితో సమగ్రంగా శుభ్రపరచడం జరిగింది. కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ రంగు నాగభూషణం, పర్యవేక్షకులు బండారి రవి, ఆడెపు శ్రీనివాస్, మహమ్మద్ ఈసుబ్, సారయ్య, సుగుణాకర్ పాల్గొన్నారు...మంత్రుల పర్యటనతో పాటు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగరాన్ని శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది....
కామెంట్లు