ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు దుర్గానగర్ ముగ్గుల పోటీల్లో,పాల్గొన్న వారి సతీమణి మనాలి ఠాగూర్..
గోదావరిఖని న్యూస్..
రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్,రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు..ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ గోదావరిఖని దుర్గానగర్లో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు..ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలను, యువతులను మనాలి రాజ్ ఠాకూర్ అభినందించి, వారి కళాత్మక ప్రతిభను ప్రశంసించారు. మహిళలలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి సంప్రదాయ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు..అలాగే, సంక్రాంతి వంటి పండుగలు మన సంప్రదాయాలు, సంస్కృతి విలువలను తరతరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు సామాజిక ఐక్యతను బలపరుస్తాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
కామెంట్లు