జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అశోక్నగర్ జెడ్పీ స్కూల్లో ట్రాఫిక్ అవగాహన సదస్సు.
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రామగుండం పట్టణంలోని అశోక్నగర్లో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.రాజేశ్వరరావు..ఆధ్వర్యంలో నిర్వహించగా, విద్యార్థులకు రోడ్డు భద్రత ప్రాముఖ్యతపై వివరించారు. టూ వీలర్ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం, వాహనానికి సంబంధించిన పత్రాలు కలిగి ఉండడం, ట్రాఫిక్ సిగ్నల్స్ను కచ్చితంగా పాటించడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు తెలియజేశారు.
అలాగే, పిల్లలు తమ తల్లిదండ్రులకు కూడా రోడ్డు భద్రత నిబంధనలను పాటించేలా సూచించాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్సై జి. హరి శేఖర్ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొని విద్యార్థులకు ట్రాఫిక్ భద్రతపై అవగాహన కల్పించారు.
బి. రాజేశ్వరరావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామగుండం ట్రాఫిక్
- Traffic Awareness
- Road Safety
- Local News
- Ramagundam


కామెంట్లు