అభినయ కల్చరల్ ఆర్ట్స్ 43వ కళోత్సవాల్లో 11వ, డివిజన్ మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు – ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్..
గోదావరిఖని న్యూస్..
”అభినయ కల్చరల్ ఆర్ట్స్ 43వ కలోత్చావాల సందర్భంగా రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్ మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. గోదావరిఖని శ్రీ కోదండ రామాలయం మైదానంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలను ఆ డివిజన్ మాజీ కార్పొరేటర్ పెద్దేల్లి తేజస్విని ప్రకాష్ లు ప్రారంభించగా, మహిళలు ఉత్చాహంగా పాల్గొని వారికి కేటాయించిన స్థలంలో వివిధ రకాల ముగ్గులను వేసి రంగులతో వాటిని అందంగా తీర్చిదిద్దారు. కాగా ముగ్గుల పోటీల పోటీలకు ఆపిల్ కిడ్స్ కరస్పాండెంట్ గాలి సునీత, లయన్స్ క్లబ్ మగువ సెక్రటరీ శశికళ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సలేషన్ బహుమతులను ప్రకటించారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్ హాజరై సంక్రాంతి ముగ్గులను అందంగా వేసిన మహిళలను అభినందించారు. అలాగే ముగ్గుల పోటీలలో ప్రథమంగా నిలిచిన వారికి మిక్సి గ్రైండర్,ద్వితీయంగా నిలిచిన వారికి పట్టు చీర,మూడవ స్థానంలో నిలిచిన వారికి ఐరన్ బాక్స్, కన్సలేషన్ కు కేటిల్ తోపాటు ముగ్గులు వేసిన మహిళలందరికీ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ మన పండుగ సాంప్రదాయాలను ఈతరం వారికి తెలియపర్చాల్సిన అవసరం ఉందన్నారు. అభినయ కల్చరల్ ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు రేణుకుంట్ల రాజమౌళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్పి సరోజ, కందునూరి రామస్వామి, బొమ్మ ప్రభాకర్, కాలనీ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు...
కామెంట్లు