వర్షపు నీటి నిల్వ ప్రాంతాలలో దోమలు వృద్ధి చెందకుండా 11 12 22 వ డివిజన్లో చర్యలు తీసుకున్న మున్సిపల్ సిబ్బంది
ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా అదనపు కలెక్టర్ మరియు కమిషనర్ శ్రీ అరుణశ్రీ గారు మరియు మేయర్ మహంకాళి స్వామి గారి ఆదేశాల మేరకు 11 ,12, 22వ డివిజన్ పరిధిలోని లక్ష్మీపురం,5ఇంక్లైన్, పరుశురాం నగర్ ఏరియాలలో వర్షపు నీటి నిల్వ ప్రాంతాలలో దోమలు వృద్ధి చెందకుండా మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు మలేరియా, డెంగు ,బోధకాలు వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా దోమలు వృద్ధి చెందే నీటి నీలువ ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది దీనివలన నీటి నిల్వ ప్రాంతాలలో దోమల గుడ్లు వృద్ధి చెందకుండా నశిస్తాయి మరియు ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ పరిసరాల పరిశుభ్రత ఆరోగ్య భద్రత తో ఉండాలని అధికారులు సూచించారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ తో పాటు సానిటరీ ఇన్స్పెక్టర్ రంగు నాగభూషణం సహాయ పర్యవేక్షకుడు ఆడెపు శ్రీనివాస్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి